న్యూజెర్సీ:మరో సిక్కు వ్యక్తి హత్య
- August 17, 2018న్యూయార్క్:న్యూజెర్సీలో సిక్కు కమ్యూనిటీకి చెందిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మూడు వారాల్లోనే ముగ్గురు సిక్కు వ్యక్తులను అమెరికాలో హత్య చేశారు. టేర్లోక్ సింగ్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల నుంచి న్యూజెర్సీలో స్టోర్ను నడుపుతున్నాడు. అయితే గురువారం రాత్రి స్టోర్లోకి ప్రవేశించిన దుండగులు టేర్లోక్ను హత్య చేశారు. సింగ్ ఛాతీపై కత్తిపోట్లు ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న సింగ్ను చూసి స్టోర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. టేర్లోక్ భార్య పిల్లలు ఇండియాలోనే నివసిస్తున్నారు. ఆగస్టు 6న సాహిబ్ సింగ్(71) అనే వ్యక్తిని మార్నింగ్ వాక్లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జులై 31న సుర్జిత్ మల్హీ(50)ను మీ దేశానికి వెళ్లిపో అని హింసిస్తూ హత్య చేశారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!