న్యూజెర్సీ:మరో సిక్కు వ్యక్తి హత్య
- August 17, 2018న్యూయార్క్:న్యూజెర్సీలో సిక్కు కమ్యూనిటీకి చెందిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మూడు వారాల్లోనే ముగ్గురు సిక్కు వ్యక్తులను అమెరికాలో హత్య చేశారు. టేర్లోక్ సింగ్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల నుంచి న్యూజెర్సీలో స్టోర్ను నడుపుతున్నాడు. అయితే గురువారం రాత్రి స్టోర్లోకి ప్రవేశించిన దుండగులు టేర్లోక్ను హత్య చేశారు. సింగ్ ఛాతీపై కత్తిపోట్లు ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న సింగ్ను చూసి స్టోర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. టేర్లోక్ భార్య పిల్లలు ఇండియాలోనే నివసిస్తున్నారు. ఆగస్టు 6న సాహిబ్ సింగ్(71) అనే వ్యక్తిని మార్నింగ్ వాక్లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జులై 31న సుర్జిత్ మల్హీ(50)ను మీ దేశానికి వెళ్లిపో అని హింసిస్తూ హత్య చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు