ముప్పుతిప్పలు పెడుతున్న మానసిక ఒత్తిడి..
- August 31, 2018హైటెక్ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇవి చివరకు బ్రెయిన్ స్ట్రోక్కూ దారితీస్తున్నాయి. పక్షవాతం అంటే వయస్సు పైబడిన వారికే వస్తుందని గతంలో అనుకునేవారు. కానీ, ఇపుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యుక్తవయసు వారికీ వస్తోంది. అంతేనా, మానసిక, పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యంబారిన పడుతున్నారు. ఒత్తిడి జయించి, బ్రెయిన్ స్ట్రోక్కు దూరంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తల్లో కొన్ని...
* రాత్రివేళ ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు.
* రోజూ దూర ప్రయాణం చేయడం మానుకోవాలి.
* మానసిక ఒత్తిడికిగురయ్యే పనులకు దూరంగా ఉండాలి.
* ఆఫీసులో అరగంటకుపైగా ఒకే విధంగా కుర్చీలో కూర్చోకూడదు.
* కూర్చుని పనిచేసే వారు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
* కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజూ సమయం కేటాయించుకోవాలి.
* నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతోపాటు మెదడుకు రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది.
* తలవెనుక భాగంలో తరుచూ నొప్పి వస్తుంటే వెన్నుపై భారం పడుతున్నట్లు భావించాలి.
* రోజూ కనీసం గంటసేపు వ్యాయమం చేయాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
* అధిక బరువు, హైపర్టెన్షన్, మధుమేహం వంటి సమస్యలుంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
* ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వుపదార్థాలు, పిండి పదార్ధాలను తగ్గించాలి. మంచి సంగీతం వినాలి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం