హైదరాబాద్ లో నేడు, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- September 14, 2018హైదరాబాద్ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ అప్గ్రేడేషన్ పనులు జరుగుతున్నందున ఈ మార్గంలో నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 సర్వీసులను శనివారం రద్దు చేయగా, ఆదివారం లింగంపల్లి-ఫలక్నుమా మధ్య నడిచే 47171 నంబరు ఎంఎంటీఎస్తోపాటు హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 47100, 47101 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేశారు. అదేవిధంగా హైదరాబాద్-పూర్ణ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు శనివారం లింగంపల్లి నుంచి రాత్రి 10.17 గంటలకు బయల్దేరుతుందని, హైదరాబాద్-కొచువెల్లి మధ్య నడిచే స్పెషల్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. పర్బానీ- హైదరాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బయల్దేరనుంది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..