చంద్రయాత్ర రాకెట్ ట్రావెల్స్.. తొలి టికెట్ బుక్కయిందట
- September 14, 2018చంద్రుని మీదకు అమెరికా వ్యోమగాములు తొలిసారి వెళ్లారు. నీల్ ఆమ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ 1969లో చంద్రునిపై కాలుమోపి చరిత్రకెక్కారు. 1972లో చివరియాత్ర జరిగింది. మొత్తం 24 మంది మాత్రమే చంద్రయాత్ర చేశారు. వారంతా వ్యోమగాములుగా శిక్షణ పొందినవారు. ఆ తర్వాత, మానవరహిత రాకెట్లు మాత్రమే చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్-ఎక్స్ కంపెనీ చంద్రుని మీదకు రాకెట్ ట్రావెల్ సర్వీస్ ప్రారంభించింది. కాకలుతీరిన వ్యోమగాములేమిటి.. సామాన్యులూ చంద్రమండల యాత్ర చేసి తరించవచ్చని టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. అప్పుడే ఓ టిక్కెట్ అమ్ముడైంది కూడా. ఈ యాత్ర కోసం బిగ్ ఫాల్కన్ రాకెట్ అనేదానిని తయారు చేశారు. తొలి పర్యాటకుడు ఎవరో సెప్టెంబర్ 17న ప్రకటిస్తామని టెస్లా కంపెనీ సీఈవో కూడా అయిన మస్క్ ట్విట్టర్లో తెలిపారు. అయితే ఈ యాత్రలో కేవలం చంద్రుని చుట్టూ రాకెట్లో చక్కర్లు కొట్టడమే ఉంటుంది. కిందకు దిగితే ఎదురయ్యే ఇబ్బందులు మామూలు ప్రయాణికులైతే తట్టుకోలేరని ఇలా ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు