ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మృతి
- September 16, 2018కొచ్చి: ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు(68) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1981లో వచ్చిన 'రక్తం' చిత్రంతో రాజు తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఆయన దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఆయన కొంతకాలం ఆర్మీలోనూ పనిచేయడంతో అందరూ 'కెప్టెన్' అని పిలుస్తుండేవారు. తెలుగులో వెంకటేశ్ నటించిన శత్రువు సినిమాలో విలన్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన ఆఖరిగా 2017లో వచ్చిన 'మాస్టర్పీస్' అనే చిత్రంలో నటించారు. జులైలో రాజు తన కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికాకు వెళుతుండగా విమానంలో గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్లోని మస్కట్కు మళ్లించి అక్కడి నుంచి కొచ్చికి తరలించారు. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…