ప్రముఖ నటుడు కెప్టెన్‌ రాజు మృతి

- September 16, 2018 , by Maagulf
ప్రముఖ నటుడు కెప్టెన్‌ రాజు మృతి

కొచ్చి: ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్‌ రాజు(68) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1981లో వచ్చిన 'రక్తం' చిత్రంతో రాజు తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఆయన దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఆయన కొంతకాలం ఆర్మీలోనూ పనిచేయడంతో అందరూ 'కెప్టెన్‌' అని పిలుస్తుండేవారు. తెలుగులో వెంకటేశ్‌ నటించిన శత్రువు సినిమాలో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆయన ఆఖరిగా 2017లో వచ్చిన 'మాస్టర్‌పీస్‌' అనే చిత్రంలో నటించారు. జులైలో రాజు తన కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికాకు వెళుతుండగా విమానంలో గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించి అక్కడి నుంచి కొచ్చికి తరలించారు. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com