సూయజ్ రాకెట్కు ప్రమాదం.. ఇద్దరు ఆస్ట్రోనాట్లకు తప్పిన ముప్పు
- October 11, 2018న్యూయార్క్: ఇద్దరు ఆస్ట్రోనాట్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ మధ్యలోనే చెడిపోవడంతో కజక్స్థాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా బయటపడ్డారు. రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెక్సీ ఓవ్చినిన్, అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ ప్రమాదంలో జరిగిన సమయంలో అందులో ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లడానికి బయలు దేరిన ఈ రాకెట్ బూస్టర్లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు సిబ్బంది బాలిస్టిక్ డీసెంట్ మోడ్లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా ట్వీట్ చేసింది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా వెల్లడించింది. సూయజ్ రాకెట్లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్ఎస్కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్లో ఉండాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..