యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- May 21, 2024
యూఏఈ: నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే 2024-25ను ప్రారంభించినట్లు ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ సర్వే ఫలితాలు దేశంలో ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు పన్నులపై విధానాలను రూపొందించడంలో అధికారులకు సహాయపడతాయి. సర్వే ఆరు నెలల్లో పూర్తవుతుందని మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ హెల్త్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ రాండ్ తెలిపారు. “మేము డేటాను విశ్లేషిస్తాము. దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకుంటాము. అయినప్పటికీ, ప్రజలు ఇందులో పాల్గొనడం తప్పనిసరి కాదు. ”అని డాక్టర్ అల్ రాండ్ అన్నారు. వివిధ వర్గాల ద్వారా ఆరోగ్యకరమైన మరియు నాన్-హెల్తీ ఆహార ఉత్పత్తుల వినియోగం, వారి ద్వారా పొగాకు వినియోగం తదితర అంశాల డేటాను సర్వే వెల్లడిస్తుందని తెలిపారు. చక్కెర ఉత్పత్తులు, ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర వస్తువులపై పన్ను విధించడానికి సంబంధించిన ఆరోగ్య ఆర్థిక విధానాన్ని రూపొందించడంలో సహాయపడే అన్ని ప్రభుత్వ సంస్థలకు సర్వే ఫలితాలను పంపుతామని ఆయన తెలిపారు. ఈ సర్వేలో 18 ఏళ్లు పైబడిన పెద్దలు, 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళలు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు అనే రెండు విభాగాలు ఉన్నాయని, ఇది నాలుగు భాషలలో(అరబిక్, ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ) నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. MoHAPతో పాటు, ఫెడరల్ కాంపిటీటివ్నెస్ అండ్ స్టాటిస్టిక్స్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, దుబాయ్ హెల్త్ అథారిటీ, ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్, అబుదాబి పబ్లిక్ హెల్త్ సెంటర్ మరియు డిజిటల్ దుబాయ్ సర్వేలో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







