యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- May 21, 2024
యూఏఈ: నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే 2024-25ను ప్రారంభించినట్లు ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ సర్వే ఫలితాలు దేశంలో ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు పన్నులపై విధానాలను రూపొందించడంలో అధికారులకు సహాయపడతాయి. సర్వే ఆరు నెలల్లో పూర్తవుతుందని మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ హెల్త్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ రాండ్ తెలిపారు. “మేము డేటాను విశ్లేషిస్తాము. దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకుంటాము. అయినప్పటికీ, ప్రజలు ఇందులో పాల్గొనడం తప్పనిసరి కాదు. ”అని డాక్టర్ అల్ రాండ్ అన్నారు. వివిధ వర్గాల ద్వారా ఆరోగ్యకరమైన మరియు నాన్-హెల్తీ ఆహార ఉత్పత్తుల వినియోగం, వారి ద్వారా పొగాకు వినియోగం తదితర అంశాల డేటాను సర్వే వెల్లడిస్తుందని తెలిపారు. చక్కెర ఉత్పత్తులు, ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర వస్తువులపై పన్ను విధించడానికి సంబంధించిన ఆరోగ్య ఆర్థిక విధానాన్ని రూపొందించడంలో సహాయపడే అన్ని ప్రభుత్వ సంస్థలకు సర్వే ఫలితాలను పంపుతామని ఆయన తెలిపారు. ఈ సర్వేలో 18 ఏళ్లు పైబడిన పెద్దలు, 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళలు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు అనే రెండు విభాగాలు ఉన్నాయని, ఇది నాలుగు భాషలలో(అరబిక్, ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ) నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. MoHAPతో పాటు, ఫెడరల్ కాంపిటీటివ్నెస్ అండ్ స్టాటిస్టిక్స్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, దుబాయ్ హెల్త్ అథారిటీ, ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్, అబుదాబి పబ్లిక్ హెల్త్ సెంటర్ మరియు డిజిటల్ దుబాయ్ సర్వేలో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









