జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- May 21, 2024
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ జోర్డాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మే 22 నుండి జోర్డాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, రెండు దేశాలకు కావలసిన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని తెలిపింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్, జోర్డానియన్ చక్రవర్తి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకోనున్నారు. అరబ్ జాయింట్ యాక్షన్కు సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో సుల్తాన్తో పాటు, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్, సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, మంత్రి సయ్యద్ బిలారబ్ బిన్ హైతామ్ అల్ సయీద్తో కూడిన ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం కూడా వెళుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









