సోమాలియాలో ఆత్మాహుతి దాడులు, 14 మంది మృతి
- October 14, 2018సోమాలియాలోని బైడొ నగరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. స్థానిక బిలాన్ హోటల్, బద్రి రెస్టారెంటు లక్ష్యంగా ఇద్దరు ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోగా .. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఆత్మాహుతి దాడులకు తామే కారణమని ఉగ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మంత్రి ఉగాస్ హాసన్ ఇబ్రహీం వెల్లడించారు.
గత మూడు దశాబ్దాలుగా హింస, అభద్రత, రాజకీయ సంక్షోభం వల్ల సోమాలియా అతలాకుతలం అవుతోంది. ఆఫ్రికన్ శాంతి పరిరక్షక దళాల సంఘాల జోక్యంతో ప్రభుత్వంలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలు, వివిధ రకాల ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే సోమాలియాలో వేలాది మంది పౌరులను పొట్టనబెట్టుకున్నాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్