తిత్లీ బాధితులకు అండ.. విజయ్ దేవరకొండ..
- October 14, 2018సినిమాల్లో హీరోలు అన్యాయాన్ని ఎదిరిస్తారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారు. కానీ నిజజీవితంలో కూడా అవసరమైనప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చి చేయూతనందిస్తారు కొందరు హీరోలు. వారే నిజమైన హీరో అనిపించుకుంటారు.
మొన్న పక్కరాష్ట్రం కేరళ వరదబాధితుల్ని అక్కున చేర్చుకుని అండగా నిలబడింది తెలుగు ఇండస్ట్రీ. అదే విధంగా ఇప్పుడు తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాలో వందల గ్రామాలకు భారీ నష్టం సంభవించడంతో సీఎం చంద్రబాబు కేంద్ర సాయాన్ని కోరారు. బాధితులకు అండగా నటుడు సంపూర్ణేష్ బాబు ముందుగా స్పందించి కొంత సాయమందించారు. మరో నటుడు విజయ్ దేవరకొండ రూ.5 లక్షల సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు పంపినట్లు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లేహ్లో ఉన్న తనకు ఇక్కడకు వచ్చాకే తిత్లీ తుఫాను గురించి తెలిసిందని వెంటనే స్పందించానని అన్నారు. గతంలో కేరళను ఆదుకున్న మనం ఇప్పుడు మన వారిని కూడా పెద్దమనసుతో ఆదుకోవాలంటూ విజయ్ పిలుపునిచ్చారు’. ఇంతకు ముందు కూడా తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చి తన గొప్పమనసు చాటుకున్నారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత