గుమ్మడి గింజలు సేవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?
- October 16, 2018గుమ్మడి గింజలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుటకు ఉపయోగపడుతాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. పురుషులకు శృంగార సామర్థ్యన్ని పెంచుతుంది.
గుమ్మడి గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ అల్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. గుమ్మడి గింజలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా వేడినీళ్లల్లో కలిపి కొద్దిగా ఉప్పు వేసుకుని తీసుకుంటే శరీర వేడి తగ్గుముఖం పడుతుంది.
తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలతో తయారుచేసిన నూనె వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. శరీరానికి కావలసిన మెగ్నిషియం గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తుంది. అందువలన ప్రతిరోజూ ఈ గింజలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి