విడుదల అయిన సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం' టీజర్!
- October 19, 2018సుమంత్ హీరోగా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి 'సుబ్రహ్మణ్యపురం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా కనిపించనుంది. ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. హేతుబద్ధంగా పురాతన ఆలయాలపై రీసెర్చ్ చేసే వ్యక్తి పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఇప్పటికేసినిమా పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసిన చిత్రబృందం టీజర్ తో అంచనాలను మరింతగా పెంచేసింది. ఒక ఊరిలో వరుసగా జరిగే హత్యలు ఎవరికి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు వీటిపై ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకునే హీరో.. ఇలా టీజర్ నిఆసక్తికరంగా కట్ చేశారు. 'ఎదురొస్తే ఏం చేస్తాడండీ.. మీ దేవుడు' అని సుమంత్చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్