తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- May 18, 2024
తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 19వ తేదీ వరకు ఈ పరిణయోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం తొలిరోజు శ్రీమలయప్పస్వామి వారు గజవాహనాన్ని అధిరోహించగా.. ఉభయనాంచారులు పల్లకీపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేశారు. పలు కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం రెండోరోజు శ్రీపద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి.
శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీపద్మావతీ పరిణయోత్సవం జరగనుంది. నారాయణగిరి ఉద్యానవనంలో కన్నుల పండువగా పరిణయోత్సవం జరగనుంది. శ్రీవారి ఆలయం నుంచి అశ్వ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనంకు స్వామివారు చేరుకుంటారు. పల్లకిపై ఉద్యానవనంకు అమ్మవార్లు చేరుకుంటారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
శుక్రవారం తిరుమల శ్రీవారిని 7,510 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కాంపార్ట్ మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లు ఉన్నాయి. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతుంది.
తాజా వార్తలు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు







