పండక్కి పతంజలి జీన్స్.. 25% డిస్కౌంట్..
- November 05, 2018ఈ దీపావళి పండుగను పతంజలి వస్త్రాలు ధరించి మరింత ఆనందంగా జరుపుకోమంటూ మార్కెట్లోకి తీసుకు వచ్చారు బాబా రాందేవ్. ఢిల్లీలో పతంజలి పరిధాన్ పేరిట యాక్సెసరీస్ స్టోర్ను సోమవారం ప్రారంభించారు. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ వస్త్రాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని స్టోర్లు ఏర్పాటు చేసి అందరికి అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారుల అభిరుచులకు తగ్గట్లు ఇక్కడ దుస్తులు లభ్యమవుతాయి. ఇంకా పండగ సీజన్ని పురస్కరించుకుని 25 శాతం డిస్కౌంట్తో దుస్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జీన్స్ రూ.500, బ్రాండెడ్ షర్ట్ రూ.500 కే ఇస్తున్నట్లు తెలిపారు. 7వేల రూపాయల విలువ చేసే వస్త్రాలను రూ.1100లకే ఇస్తున్నట్లు తెలియజేశారు. పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలను నియంత్రించి స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించే దిశగా పతంజలి పరిధాన్ను తీసుకు వచ్చామని రాందేవ్ అంటున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు