రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ళ మహిళ మృతి
- November 05, 2018షార్జా:కుమార్తెను ట్రాలర్లో వేసుకుని వెళుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, 16 నెలల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలో ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డ చిన్నారిని, ఆమె తల్లిని వెంటనే అల్ కాసిమి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో ఆ మహిళ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రోడ్ క్రాసింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో రోడ్ క్రాస్ చేయడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అతి వేగం కూడా కారణమని వారు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక