దుబాయ్ చేరుకున్న కొత్త మెట్రో రైళ్ళు
- November 10, 2018దుబాయ్:కొత్త మెట్రో రైళ్ళకు సంబంధించి తొలి దఫాలో 50 రైళ్ళు దుబాయ్ చేరుకున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ రైళ్ళను రషిదియా మెట్రో డిపోకి తరలించారు. 2019 అక్టోబర్ నాటికి మొత్తం రైళ్ళన్నీ దుబాయ్కి చేరుకుంటాయని ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. రెడ్ లైన్ రూట్ 2020లో త్వరలో ఈ రైళ్ళను పరీక్షించబోతఱున్నారు. ప్రస్తుతం 643 మంది ప్రయాణీకులకు వీలుగా రైళ్ళ డిజైన్లు వుండగా, కొత్త రైళ్ళలో 696 మంది ప్రయాణీకులకు వీలుంటుంది. ఎక్స్టీరియర్ డిజైన్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. కొత్త ట్రైన్లలో చివరి క్యారేజ్ మహిళలు, పిల్లల కోసం వినియోగిస్తారు. ఫస్ట్ క్యారేజ్ గోల్డ్ క్లాస్లో వుంటుంది. మిగతా క్యారేజెస్ అన్నీ సిల్వర్ క్లాస్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం