యెమెన్‌లో నర మేధం.. 149 మృతి

- November 12, 2018 , by Maagulf
యెమెన్‌లో నర మేధం.. 149 మృతి

యెమెన్‌:యెమెన్‌లోని హొదైడా నగరంలో ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన అల్లర్లలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. కేవలం 24 గంటల్లో 149 మంది ప్రాణాలు కోల్పోయారని ఇవాళ సైన్యం వెల్లడించింది. చనిపోయిన వారిలో ఏడుగురు సాధారణ పౌరులు ఉన్నట్లు సమాచారం. అల్లర్లలో 110 మంది హుతి తిరుగుబాటు దారులు, 32 మంది ప్రభుత్వ మద్దతుదారులు గత రాత్రి మృతి చెందారు. సౌదీ అరేబియా నేతృత్వంలోని బలగాలు ప్రభుత్వానికి మద్దతుగా ఆదివారం తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో అధిక సంఖ్యలో తిరుగుబాటుదారులు చనిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com