శేఖర్ కమ్ముల కొత్త చిత్రం లాంచ్ అయ్యింది..
- November 12, 2018
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మరో రొమాంటిక్ కథతో ప్రేక్షకుల్ని 'ఫిదా' చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. వరుణ్ తేజ, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన 'ఫిదా' చిత్రంతో సూపర్ హిట్ ని సొంతం చేసుకొన్న ఆయన, యేడాది పైగా దాదాపు 16 నెలలు గడిచినా కొత్త సినిమాని మాత్రం ప్రకటించలేదు. స్క్రిప్టు రాసుకుంటూ కూర్చున్నారు. మొత్తానికి అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ రోజు సినిమాని లాంచ్ చేసారు.
మ్యూజికల్ డ్రామా గా సాగే ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ లోని ఆసియన్ సినిమాస్ ప్రొడక్షన్ ఆఫీస్ లో ప్రారంభమైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఓ కొత్త కుర్రాడు ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. వచ్చే వేసవి కు ఈ సినిమాని రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్.
ఇక నటీనటులు ఎవరనేది తెలియలేదు కానీ... తన ఈ సినిమా మాత్రం ఓ పూర్తి స్దాయి ప్రేమకథతో తెరకెక్కబోతోందని స్పష్టమైంది. పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఏషియన్ గ్రూప్ తొలిసారి నిర్మాణంలోకి అడుగుపెట్టి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా రూపొందించబోతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







