346 మంది వలసదారుల అరెస్ట్
- November 12, 2018మస్కట్: 346 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మరో 446 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 4 నుంచి 11 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్ట్ చేసినవారిలో 169 మంది ఫ్యుజిటివ్ వర్కర్స్ కాగా, 162 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్, 15 మంది డాక్యుమెంట్స్ లేని కార్మికులు. క్యాపిటల్ సిటీ మస్కట్లో అత్యధికంగా 111 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి స్థానం నార్త్ బతినా గవర్నరేట్ది. ఇక్కడ 66 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను 446 మంది కార్మికుల్ని బహిష్కరించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!