ప్రపంచంలోనే రెండు దిగ్గజ సంస్థల మధ్య జరుగుతున్న వార్
- November 15, 2018కాలిఫోర్నియా: ప్రపంచంలోనే రెండు దిగ్గజ సంస్థల మధ్య జరుగుతున్న వార్ ఇది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పద్ధతి నచ్చని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్బర్గ్.. ఇక నుంచి స్టాఫ్ ఎవరూ ఆపిల్ ఉత్పత్తులను వాడకూడదని ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఫేస్బుక్ యూజర్ల ప్రైవసీపై కుక్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జుకెర్బర్గ్ సహించలేకపోయారు. వెంటనే తన ఎగ్జిక్యూటివ్స్ను పిలిచి ఐఫోన్లు వాడొద్దని స్పష్టం చేశారు. ఆపిల్ బదులు ఆండ్రాయిడ్ డివైస్లను ప్రోత్సహించాల్సిందిగా ఆయన సూచించడం విశేషం. ఎంఎస్ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఫేస్బుక్పై పరోక్షంగా స్పందించారు.
ఆపిల్ ఎప్పుడూ యూజర్ల వ్యక్తిగత జీవితాలు, గోప్యతకు భంగం వాటిల్లకుండా చూస్తుందని కుక్ అన్నారు. గోప్యత అనేది ప్రతి మనిషికి ఉండే ఓ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మొదట్లో యూజర్ల ప్రైవసీని ఫేస్బుక్ దెబ్బతీసిందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంతో ఫేస్బుక్ బాగోతం బయటపడింది. దీనినే కుక్ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
అయితే ఆ కామెంట్స్ జుకెర్బర్గ్కు ఎక్కడలేని ఆగ్రహాన్ని తెప్పించాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!