కిరాతకం.. 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న తాలిబన్లు..

- November 15, 2018 , by Maagulf
కిరాతకం.. 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న తాలిబన్లు..

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి కిరాతకానికి పాల్పడ్డారు. ఫరా ప్రావిన్స్‌లోని పోలీస్‌ పోస్టుపై దాడి చేసి 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. ఖాకి సఫేద్‌ జిల్లాలోని పోలీస్‌ పోస్టులోకి కొందరు ఉగ్రవాదులు చొరబడి భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

వారిని అడ్డుకునేందుకు రకణసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 35 మంది భద్రతాసిబ్బంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో 17 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com