నామినేషన్‌ వేసిన సుహాసిని ...

- November 17, 2018 , by Maagulf
నామినేషన్‌ వేసిన  సుహాసిని ...

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్ధిగా సుహాసిని నామినేషన్‌ వేశారు. కూకట్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు, కూకట్‌పల్లి టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సుహాసిని నామినేషన్‌ వేస్తున్నారని తెలియగానే కూకట్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయానికి నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సుహాసిని నామినేషన్‌ కార్యక్రమానికి వచ్చిన శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్ధి భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ను చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వచ్చిన ఆనంద్‌ ప్రసాద్‌ను పోలీసులు అడ్డుకుని తోసేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com