అమృత్సర్లో భారీ పేలుడు, ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
- November 18, 2018పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నిరంకారీ భవన్ వద్ద ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో పంజాబ్లో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అమృత్సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. నిరంకారీ భవన్ స్థానిక ఆధ్యాత్మిక మందిరం. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకి చేరుకున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం