ఇండియన్‌ సోషల్‌ రిఫార్మర్‌కి బహ్రెయిన్‌లో ఘన నివాళి

- November 20, 2018 , by Maagulf
ఇండియన్‌ సోషల్‌ రిఫార్మర్‌కి బహ్రెయిన్‌లో ఘన నివాళి

అలిగర్‌ ముస్లిం యూనివర్సిటీ అల్యూమినీ అసోసియేషన్‌ బహ్రెయిన్‌ (ఎఎమ్‌యుఎఎబి), తమ ఫౌండర్‌ సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ 201వ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 275 మంది హాజరయ్యారు. ఎఎంయు అల్యుమినీ - బహ్రెయిన్‌లో ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద గ్యాదరింగ్‌. సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ పాటించిన విలువలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా వున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. షురా మెంబర్‌ డాక్టర్‌ ఫాతెమా అబ్దుల్‌జబ్బార్‌ అలకూహెజి, అనుభవవ్‌ సిన్హా తదిత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎఎమ్‌యుఎఎబి జనరల్‌ సెక్రెటరీ డాక్టర్‌ షరిక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, గ్రేట్‌ స్కాలర్‌, విజనరీ, సోషల్‌ రిఫార్మర్‌ సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ని స్మరించుకోవడం గొప్ప విషయమని అన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com