పంకజ్ మళ్లీ ప్రపంచ విజేత
- November 20, 2018
యాంగ్వాన్ (మయన్మార్): భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ చరిత్ర సృష్టించాడు. పోటీకి మరోమారు ఘనంగా చాటి చెప్పాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ఐబిఎస్ఎఫ్ బిలియర్డ్స్ చాంపియ న్షిప్ను కైవసం చేసుకుంటూ ఏకంగా 21వ సారి ప్రపంచ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. రెండు రోజుల వ్యవధిలోనే మరో ప్రపంచ టైటిల్ను ఖాతాలో వేసుకుంటు తనకు తిరుగులేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్.. భారత్కు చెందిన భాస్కర్పై అలవోక విజయం సాధించాడు. రెండుసార్లు ఆసియా రజత పతక విజేత అయిన భాస్కర్ను అద్వానీ అలవోకగా ఎదుర్కొం టూ గేమ్ను దక్కించుకున్నాడు. వరుస గేముల్లో 190, 173, 198 స్కోర్లతో అద్వానీ తన దూకుడు కొనసాగించగా, భాస్కర్ మాత్రం సెంచరీ మార్క్ అందుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. తనదైన రీతిలో పాయింట్లు కొల్లగొడుతూ పంకజ్ 1000 మార్క్ను అందుకుంటే.. ప్రత్యర్థి 206కే పరిమితమై అందనంత దూరంలో ఆగిపోయాడు.గతేడాది ఇక్కడే జరిగిన ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన ఈ దిగ్గజ క్యూయిస్టుకు బిలియర్డ్స్లో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ బిలియర్డ్స్లో నాలుగో గ్రాండ్ డబుల్తో ఈ ప్రపంచాన్ని జయించినట్లు ఉంది.భాస్కర్, కాజియర్, రస్సెల్ లాంటి దీటైన ప్రత్యర్థులను ఎదుర్కొవడం అంత సులువేమి కాదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం నమ్మశక్యంగా ఉంది. 21వ ప్రపంచ టైటిల్తో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇదే జోరును కొనసాగిస్తూ స్నూకర్ టైటిల్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అని పంకజ్ అన్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







