సముద్రగర్భంలో హైస్పీడ్ రైళ్లు ... చైనాలో తొలిసారి
- November 23, 2018బీజింగ్: ఎన్నో అద్భుతాలకు వేదికైన చైనాలో తొలిసారి సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించబోతున్నారు. హైస్పీడ్ రైళ్ల కోసం ఈ టన్నెల్ను ఉపయోగించనున్నారు. తూర్పు ప్రావిన్స్ ఝెజియాంగ్లోని రెండు నగరాలను ఇది కలపనుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నర ప్రయాణ సమయం.. 30 నిమిషాలకు పరిమితం కానుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ మొత్తం పొడవు 70.92 కిలోమీటర్లు కాగా.. అందులో 16.2 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్నారు. ఝెజియాంగ్ ప్రావిన్స్లోని నింగ్బో నగరాన్ని ద్వీప నగరమైన ఝౌషాన్తో కలపనుంది.
ఈ మార్గంలో హైస్పీడ్ రైలు గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కొత్త ప్రాజెక్ట్తో చైనాలో మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గం పొడవు 25 వేల కిలోమీటర్లకు చేరింది. ప్రపచంలోని మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గంలో 60 శాతం చైనాలోనే ఉండటం విశేషం. చైనాలోనూ ఈ ఝెజియాంగ్ ప్రావిన్స్లోనే తొలిసారి హైస్పీడ్ రైలు మార్గాన్ని లాంచ్ చేశారు. చైనా అభివృద్ధిలో ఈ హైస్పీడ్ రైళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బీజింగ్-షాంఘైలాంటి రూట్లలో గంటలకు గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లు ఉండటం విశేషం.
ఇండియాలోనూ ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ రైలు కోసం సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ