కియా కార్లు.. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్లు..
- December 06, 2018ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు వేసింది. రాబోయే తరం పర్యావరణ రవాణాపై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమరావతిలోని సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వాటిని స్వయంగా పరిశీలించిన చంద్రబాబు.. కియా మోటర్స్ ఎండీతో కలిసి కాసేపు కార్లో ప్రయాణించారు.
కియా ఎలక్ట్రిక్ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం విజయవాడతో పాటు పలు నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.ఏపీలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కియా మోటార్స్ సహాయపడనుంది. ఒప్పందంలో భాగంగా కియా మోటార్స్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి 3 ఎలక్ట్రిక్ కార్లను బహుమతిగా ఇవ్వనుంది.
ఇప్పటికే కియా సంస్థ తన కార్ల ఫ్లాంట్ను అనంతరం పురం జిల్లాలో నెలకొల్పింది. ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కియా మోటార్స్. ఏపీలో ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కియా కంపెనీ సిద్ధమైంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!