ఆధార్ డేటాను ఉపసంహరించుకొనే వెసులుబాటు!
- December 06, 2018ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటా ఉపయోగించుకొనేందుకు వీలు కల్పిస్తోన్న ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను కొట్టేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థలు.. వ్యక్తుల ఆధార్ డేటాను తీసుకోవడం రాజ్యాంగ బద్ధం కాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆధార్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. సుప్రీం ధర్మాసనం ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. కొందరు వ్యక్తులు తమ ఆధార్ సంఖ్య, బయోమెట్రిక్ వంటి వివరాలను గతంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. అయితే ఈ వివరాలను వెనక్కి తీసుకునే వెసులుబాటుపై ప్రభుత్వం సవరణలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రూపొందించింది. 18 ఏళ్ల వయసు దాటినవారికి అంతకుముందు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఆధార్ వివరాలను ఉపసంహరించుకొనేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని యూఐడీఏఐ ప్రతిపాదించింది. కాగా సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ ను అనుసంధానించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు సమయంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే పాన్ కార్డుకు మాత్రం ఆధార్ అనుసంధానాన్ని సమర్థించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ