200,000 ప్రైజ్ స్కామ్: 19 మంది అరెస్ట్
- December 17, 201819 మంది సభ్యులుగల ముఠాని అజ్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోగస్ క్యాష్ ప్రైజులతో అమాయకుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారంతా ఆసియాకి చెందినవారే. అజ్మన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ హమాద్ బిన్ యఫౌర్ అల్ ఘాఫ్లి మాట్లాడుతూ, ఓ టెలికామ్ సంస్థ నుంచి 200,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నట్లుగా తమకు ఫోన్లు వచ్చాయని ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేశామని అన్నారు. బ్యాంక్ డిటెయిల్స్ ఇస్తే, డబ్బుని జమ చేస్తామని నిందితులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, అజ్మన్లో నిందితులు దాక్కున్న స్థలాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…