వైఎస్సార్ బయోపిక్: 'యాత్ర' టీజర్!

- December 21, 2018 , by Maagulf
వైఎస్సార్ బయోపిక్: 'యాత్ర' టీజర్!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్నచిత్రం 'యాత్ర'. ఈరోజు వైఎస్ తనయుడు జగన్ పుట్టినరోజు సందర్భంగాచిత్రబృందం సినిమా టీజర్ ని విడుదల చేసింది.

ఏపీ రాజకీయాలపైఎంతో ప్రభావం చూపిన రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఈ సినిమాలోప్రధానంగా చూపించబోతున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి..వైఎస్ పాత్ర పోషించబోతున్నారు.

''నీళ్లు ఉంటే కరెంట్‌ ఉండదు. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు. రెండు ఉండి పంటచేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా. మమ్మల్ని రాజులుగా కాదు..కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు'' అంటూ ఓ రైతు తమ బాధలనుచెప్పుకునే సన్నివేశంతో టీజర్ మొదలైంది.
'నేను విన్నాను.. నేనున్నాను'అంటూ వైఎస్ పాత్రలో మమ్ముట్టి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com