వైఎస్సార్ బయోపిక్: 'యాత్ర' టీజర్!
- December 21, 2018దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్నచిత్రం 'యాత్ర'. ఈరోజు వైఎస్ తనయుడు జగన్ పుట్టినరోజు సందర్భంగాచిత్రబృందం సినిమా టీజర్ ని విడుదల చేసింది.
ఏపీ రాజకీయాలపైఎంతో ప్రభావం చూపిన రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఈ సినిమాలోప్రధానంగా చూపించబోతున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి..వైఎస్ పాత్ర పోషించబోతున్నారు.
''నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు. రెండు ఉండి పంటచేతికొస్తే సరైన ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. సరైన కూడు, గుడ్డ, నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్యా. మమ్మల్ని రాజులుగా కాదు..కనీసం రైతులుగా బతకనివ్వండి చాలు'' అంటూ ఓ రైతు తమ బాధలనుచెప్పుకునే సన్నివేశంతో టీజర్ మొదలైంది.
'నేను విన్నాను.. నేనున్నాను'అంటూ వైఎస్ పాత్రలో మమ్ముట్టి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!