15 మిలియన్ దిర్హామ్ల లాటరీ: ప్రాంక్ కాల్ అనుకున్నానంటోన్న ఇండియన్
- January 03, 201915 మిలియన్ దిర్హామ్ల లాటరీని బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గెల్చుకున్న ఇండియన్, తాను ఇంకా ఈ వాస్తవాన్ని నిజమని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. శరత్ పురుషోత్తమన్ అనే భారత వలసదారుడు, బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద మొత్తమైన 15 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న సంగతి తెల్సిందే. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో ఈ డ్రా నిర్వహించారు. విజేతకు పలుమార్లు ఫోన్ చేశామనీ, అయితే అది నిజమని ఆయన తొలుత నమ్మలేదని బిగ్ టికెట్ అబుదాబీ డ్యూటీ ఫ్రీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షెరిల్ ఫజార్డో చెప్పారు. 083733 నెంబర్ టిక్కెట్పై ఈ బహుమతి పురుషోత్తమన్ని వరించింది. గెలిచిన విషయాన్ని తెలియజేయడం జరిగిందనీ, అయితే అది నిజమని ఒప్పించడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు అన్నారు. కాగా, రెండో ప్రైజ్ 100,000 దిర్హామ్లు కూడా భారతదేశానికి చెందిన వ్యక్తి జినాచంద్రన్ వజూర్ నారాయణన్ గెల్చుకోవడం గమనార్హం. పాకిస్తాన్కి చెందిన షాహిద్ ఫరీద్ మూడో బహుమతి గెలుచుకున్నారు. మొత్తంగా ఈ డ్రాలో 8 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు