రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి
- January 03, 2019
మస్కట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన దోఫార్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓవర్ టర్న్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. దోఫార్లోని జబాల్ అల్ కమార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్ అబ్దుల్లా బిన్ సలెహ్ బిన్ మొహమ్మద్ అల్ బలౌషి కాగా, మరొకరు కార్పొరల్ ఖామిస్ బిన్ సైఫ్ బిన్ మొహమ్మద్ అల్ ముక్బాలి. గాయపడ్డ వ్యక్తిని ముతాసిమ్ బిన్ హమాద్ బిన్ సలూమ్ అల్ బసామిగా గుర్తించారు. రాయల్ ఆర్మీ కమాండ్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డ ఆర్మీ అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







