రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి
- January 03, 2019మస్కట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన దోఫార్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓవర్ టర్న్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. దోఫార్లోని జబాల్ అల్ కమార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్ అబ్దుల్లా బిన్ సలెహ్ బిన్ మొహమ్మద్ అల్ బలౌషి కాగా, మరొకరు కార్పొరల్ ఖామిస్ బిన్ సైఫ్ బిన్ మొహమ్మద్ అల్ ముక్బాలి. గాయపడ్డ వ్యక్తిని ముతాసిమ్ బిన్ హమాద్ బిన్ సలూమ్ అల్ బసామిగా గుర్తించారు. రాయల్ ఆర్మీ కమాండ్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డ ఆర్మీ అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు