రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి

- January 03, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి

మస్కట్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలో జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓవర్‌ టర్న్‌ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. దోఫార్‌లోని జబాల్‌ అల్‌ కమార్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్‌ అబ్దుల్లా బిన్‌ సలెహ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ బలౌషి కాగా, మరొకరు కార్పొరల్‌ ఖామిస్‌ బిన్‌ సైఫ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ముక్బాలి. గాయపడ్డ వ్యక్తిని ముతాసిమ్‌ బిన్‌ హమాద్‌ బిన్‌ సలూమ్‌ అల్‌ బసామిగా గుర్తించారు. రాయల్‌ ఆర్మీ కమాండ్‌, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డ ఆర్మీ అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com