రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి
- January 03, 2019
మస్కట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన దోఫార్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓవర్ టర్న్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. దోఫార్లోని జబాల్ అల్ కమార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్ అబ్దుల్లా బిన్ సలెహ్ బిన్ మొహమ్మద్ అల్ బలౌషి కాగా, మరొకరు కార్పొరల్ ఖామిస్ బిన్ సైఫ్ బిన్ మొహమ్మద్ అల్ ముక్బాలి. గాయపడ్డ వ్యక్తిని ముతాసిమ్ బిన్ హమాద్ బిన్ సలూమ్ అల్ బసామిగా గుర్తించారు. రాయల్ ఆర్మీ కమాండ్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డ ఆర్మీ అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!







