రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి
- January 03, 2019
మస్కట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన దోఫార్ గవర్నరేట్ పరిధిలో జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓవర్ టర్న్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. దోఫార్లోని జబాల్ అల్ కమార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్ అబ్దుల్లా బిన్ సలెహ్ బిన్ మొహమ్మద్ అల్ బలౌషి కాగా, మరొకరు కార్పొరల్ ఖామిస్ బిన్ సైఫ్ బిన్ మొహమ్మద్ అల్ ముక్బాలి. గాయపడ్డ వ్యక్తిని ముతాసిమ్ బిన్ హమాద్ బిన్ సలూమ్ అల్ బసామిగా గుర్తించారు. రాయల్ ఆర్మీ కమాండ్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డ ఆర్మీ అధికారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









