15 మిలియన్ దిర్హామ్ల లాటరీ: ప్రాంక్ కాల్ అనుకున్నానంటోన్న ఇండియన్
- January 03, 201915 మిలియన్ దిర్హామ్ల లాటరీని బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గెల్చుకున్న ఇండియన్, తాను ఇంకా ఈ వాస్తవాన్ని నిజమని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. శరత్ పురుషోత్తమన్ అనే భారత వలసదారుడు, బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద మొత్తమైన 15 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న సంగతి తెల్సిందే. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో ఈ డ్రా నిర్వహించారు. విజేతకు పలుమార్లు ఫోన్ చేశామనీ, అయితే అది నిజమని ఆయన తొలుత నమ్మలేదని బిగ్ టికెట్ అబుదాబీ డ్యూటీ ఫ్రీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షెరిల్ ఫజార్డో చెప్పారు. 083733 నెంబర్ టిక్కెట్పై ఈ బహుమతి పురుషోత్తమన్ని వరించింది. గెలిచిన విషయాన్ని తెలియజేయడం జరిగిందనీ, అయితే అది నిజమని ఒప్పించడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు అన్నారు. కాగా, రెండో ప్రైజ్ 100,000 దిర్హామ్లు కూడా భారతదేశానికి చెందిన వ్యక్తి జినాచంద్రన్ వజూర్ నారాయణన్ గెల్చుకోవడం గమనార్హం. పాకిస్తాన్కి చెందిన షాహిద్ ఫరీద్ మూడో బహుమతి గెలుచుకున్నారు. మొత్తంగా ఈ డ్రాలో 8 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ