15 మిలియన్ దిర్హామ్ల విజేతలు ఈ బెస్ట్ ఫ్రెండ్స్
- January 04, 2019యూ.ఏ.ఈ:ఇద్దరు స్నేహితులు.. కొత్త ఏడాదిలో అత్యద్భుతమైన బహుమతిని గెల్చుకున్నారు. ఈ ఆనంద క్షణాల్ని పంచుకుంటూ జీవితంలో ఎన్నో కష్ట సుఖాల్ని కలిసే ఎదుర్కొన్నామనీ, ఇప్పుడు ఈ బహుమతిని తాము పంచుకుంటున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. 34 ఏళ్ళ శరత్ పురుషోత్తమన్, 36 ఏళ్ళ ప్రశాంత్ సురేంద్రన్.. కేరళకు చెందినవారు. ఇద్దరూ ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. దుబాయ్లో ఈ ఇద్దరూ ఒకే రూమ్లో వున్నారు. కష్ట సుఖాల్లో ఇద్దరం కలిసే వున్నామనీ, ఒకరి అవసరాల్ని ఇంకొకరు తీర్చేందుకు కష్టపడ్డామని చెప్పారు. శరత్ పురుషోత్తమన్ పేరు మీద టిక్కెట్కి బహుమతి లభించింది. మొత్తం 15 మిలియన్ దిర్హామ్ల బహుమతి శరత్ని వరించింది. బహుమతి గెల్చుకున్న ఆనందంలో తన తల్లిని చూడాలని వుందంటున్నారు శరత్. మరోపక్క తన కుమార్తె తనకు లక్ అని ప్రశాంత్ అంటున్నారు. ఈ ఆనంద క్షణాల్లో తమ కుటుంబాలతో వుండాలని కోరుకుంటున్నామనీ, ఆ తర్వాతే ఈ బహుమతిని ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్