కింగ్డమ్ని సందర్శించిన 10.3 మిలియన్ పర్యాటకులు
- January 04, 2019బహ్రెయిన్:2018 ఏడాదిలో 10.3 మిలియన్ టూరిస్టులు బహ్రెయిన్లో పర్యటించారు. 2017తో పోల్చితే, 2018లో 10.3 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం ద్వారా కింగ్డమ్లో పర్యాటకం ఆశించిన రీతిలో వృద్ధి చెందుతోందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మరియు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. టూరిస్టులు బహ్రెయిన్లో మొత్తం 9.8 మిలియన్ రోజులు స్పెండ్ చేసినట్లయ్యింది. ఇది 22.3 శాతం అధికం గత ఏడాదితో పోల్చి చూస్తే. 2018 తొలి తొమ్మిది నెలల్లో 9.1 మిలియన్ పర్యాటకులు వచ్చినట్లు నిర్ధారితమయ్యింది. గత ఏడాది ఈ కాలంతో పోల్చితే 5.7 శాతం పెరుగుదల ఈ ఏడాది నమోదయ్యింది. వాటెల్ హెటల్, టూరిజం బిజినెస్ స్కూల్ వంటి వాటిని ఈ ఏడాది బహ్రెయిన్ ప్రారంభించింది. ఇవన్నీ టూరిజం వృద్ధికి ఉపకరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్