కింగ్డమ్ని సందర్శించిన 10.3 మిలియన్ పర్యాటకులు
- January 04, 2019
బహ్రెయిన్:2018 ఏడాదిలో 10.3 మిలియన్ టూరిస్టులు బహ్రెయిన్లో పర్యటించారు. 2017తో పోల్చితే, 2018లో 10.3 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం ద్వారా కింగ్డమ్లో పర్యాటకం ఆశించిన రీతిలో వృద్ధి చెందుతోందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మరియు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. టూరిస్టులు బహ్రెయిన్లో మొత్తం 9.8 మిలియన్ రోజులు స్పెండ్ చేసినట్లయ్యింది. ఇది 22.3 శాతం అధికం గత ఏడాదితో పోల్చి చూస్తే. 2018 తొలి తొమ్మిది నెలల్లో 9.1 మిలియన్ పర్యాటకులు వచ్చినట్లు నిర్ధారితమయ్యింది. గత ఏడాది ఈ కాలంతో పోల్చితే 5.7 శాతం పెరుగుదల ఈ ఏడాది నమోదయ్యింది. వాటెల్ హెటల్, టూరిజం బిజినెస్ స్కూల్ వంటి వాటిని ఈ ఏడాది బహ్రెయిన్ ప్రారంభించింది. ఇవన్నీ టూరిజం వృద్ధికి ఉపకరిస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









