కింగ్డమ్ని సందర్శించిన 10.3 మిలియన్ పర్యాటకులు
- January 04, 2019
బహ్రెయిన్:2018 ఏడాదిలో 10.3 మిలియన్ టూరిస్టులు బహ్రెయిన్లో పర్యటించారు. 2017తో పోల్చితే, 2018లో 10.3 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం ద్వారా కింగ్డమ్లో పర్యాటకం ఆశించిన రీతిలో వృద్ధి చెందుతోందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మరియు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. టూరిస్టులు బహ్రెయిన్లో మొత్తం 9.8 మిలియన్ రోజులు స్పెండ్ చేసినట్లయ్యింది. ఇది 22.3 శాతం అధికం గత ఏడాదితో పోల్చి చూస్తే. 2018 తొలి తొమ్మిది నెలల్లో 9.1 మిలియన్ పర్యాటకులు వచ్చినట్లు నిర్ధారితమయ్యింది. గత ఏడాది ఈ కాలంతో పోల్చితే 5.7 శాతం పెరుగుదల ఈ ఏడాది నమోదయ్యింది. వాటెల్ హెటల్, టూరిజం బిజినెస్ స్కూల్ వంటి వాటిని ఈ ఏడాది బహ్రెయిన్ ప్రారంభించింది. ఇవన్నీ టూరిజం వృద్ధికి ఉపకరిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







