సెన్సార్ పూర్తి చేసుకున్న "ఎన్టీఆర్-కథానాయకుడు"..9న గ్రాండ్ గా విడుదల..!!
- January 05, 2019నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఎన్టీఆర్-కథానాయకుడు" చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని 'U' సర్టిఫికేట్ ని పొందింది.. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల యాభై నిమిషాల నిడివితో చిత్రం జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.. విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి , సుమంత్, కళ్యాణ్ రామ్ తదితరులు చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో మంచి స్పందన దక్కించుకోగా సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు