సామూహిక నిరాహార దీక్షకు పాలస్తీనా ఖైదీలు సిద్ధం
- January 08, 2019జెరూసలేం : జైళ్ళలో పరిస్థితులను మరింత అధ్వాన్నం చేసేలా కొత్త చర్యలు చేపట్టాలని ఇజ్రాయిల్ ప్రభుత్వం భావిస్తోంది. అదే గనుక జరిగితే మూకుమ్మడిగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇజ్రాయిల్ జైళ్ళు, నిర్బంధ కేంద్రాలు, ఇంటరాగేషన్ కేంద్రాల్లోని వందలాదిమంది పాలస్తీనియన్లు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఖైదీలు, పాలనాపరమైన నిర్బంధితులు (ఎలాంటి అభియోగాలు లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నవారు) ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కొత్త తరహా అణచివేత చర్య అని వారు వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తీసుకోవడమంటే యుద్ధం ప్రకటించడమేనని, దీంతో తమ పోరాటంలో కొత్త దశ ఆరంభమైందని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. తమకు సంఘీభావంగా నిలబడాల్సిందిగా వారు పాలస్తీనా వర్గాలను, కార్యకర్తలను కోరారు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. ఇజ్రాయిల్లో 5500 పాలస్తీనా ఖైదీలు వున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి