తమిళనాడులో ఫ్యాన్స్ వార్
- January 10, 2019తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఏకంగా ఒకరిపై ఒకరు కత్తులతో పొడుచుకునే స్థాయి వరకు వెళ్లింది అభిమానుల గొడవ. ఇవాళ పొంగల్ కానుకగా రజనీకాంత్ నటించిన పేట సినిమా.. అజిత్ నటించిన విశ్వాసం సినిమా విడుదలయ్యాయి. దీంతో తమిళనాడులో ఇద్దరు హీరోల అభిమానుల గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. పలు చోట్ల ఫ్యాన్స్ ఘర్షణలకు దిగటంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
వేలూరులోని రోహిణి థియేటర్ ముందు ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో నలుగురు పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అభిమానుల మాత్రం తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్ అంటూ దాడులకు తెగబడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!