అవి తింటే మజ్జిగ తీసుకోవడం తప్పనిసరి...
- January 11, 2019మసాలా దినుసులు తింటున్నారా.. అయితే తప్పక మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్నవారు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. మసాలా దినుసులు తిన్న తరువాత మజ్జిగ సేవించడం ద్వారా అసిడిటీ కూడా తగ్గుముఖం పడుతుంది.
పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరగించుకోవాలి. కాసేపటివరు అలానే ఉంచి ఆ తరువాత చల్లార్చుకోవాలి. ఈ తులసి నీటిని ప్రతి రోజూ తాగడం వలన
పది రోజుల్లో గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. అలానే గ్యాస్కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. బెల్లం గ్యాస్ సమస్యకు ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది.
ఇకపోతే.. ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!