తేజు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
- January 16, 2019సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ .. రితిక సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కథానాయికలలో ఒకరి పేరు 'చిత్ర' .. మరొకరి పేరు 'లహరి' అయ్యుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ టైటిల్లోని అయిదు అక్షరాలలో, ఒక్కో అక్షరంతో మొదలయ్యే ఒక్కో పేరుతో అయిదు ముఖ్యమైన పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు