ప్రాణం తీసిన నిద్ర మత్తు
- January 17, 201926 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు ధయిద్ నుంచి షార్జాకి వెళుతుండగా బ్రిడ్జి నెంబర్ 10 వద్ద తన కారు ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ యువకుడికి నిద్ర ముంచుకు రావడంతో నిద్ర మత్తులో కారుని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కారు అతి వేగంతో దూసుకుపోతోంది. ఈ కారణంగా పలు మార్లు కారు గాల్లోకి ఎగిరి, ఫ్లిప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినా అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!