డ్రగ్స్ స్మగ్లింగ్: కువైటీ, ఆసియన్ అరెస్ట్
- January 17, 2019
కువైట్ సిటీ: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, మరొకరు కువైటీ. ఆసియా జాతీయుడి నుంచి 38 పీస్ల కన్నాబిస్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 250 గ్రాములు. ఇండియా నుంచి నిందితుడు కువైట్కి వస్తుండగా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో, కువైటీ నిందితుడి నుంచి మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా నుంచి నిందితుడు కువైట్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దర్నీ జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్కి అప్పగించారు.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







