ఇండియాకి ప్రమోషనల్ రేట్స్ ప్రకటించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
- January 18, 2019బహ్రెయిన్ నుంచి కోజికోడ్, కోచి, తిరువనంతపురం మరియు మంగళూరుకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 'ఆల్ ఇంక్లూజివ్' ప్రమోషనల్ ఫేర్స్ని ప్రకటించింది. జనవరి 17 నుంచి 23 మధ్య టిక్కెట్లను బుక్ చేసుకుని జనవరి 17 నుంచి మార్చి 30 లోపు ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బహ్రెయిన్ నుంచి కోచి ప్రయాణానికి 47 బహ్రెయినీ దినార్స్ నుంచి ధరలు మొదలవుతాయి. బహ్రెయిన్ నుంచి కోజికోడ్కి టిక్కెట్ ధరలు 52 బహ్రెయినీ దినార్స్, బహ్రెయిన్ నుంచి మంగళూరుకి 62 బహ్రెయినీ దినార్స్ నుంచి టిక్కెట్ ధరలు వుంటాయి. వీటితోపాటుగా 30 కిలోలల ఉచిత బ్యాగేజీ అలవెన్స్ని కూడా అందించనుంది. ప్రయాణీకులకు 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీని అందిస్తారు. 5 కిలోల అదనపు బ్యాగేజీని 8 బహ్రెయినీ దినార్స్ చెల్లించి తీసుకెళ్ళొచ్చు. 25 బోయింగ్ 737-800 ఎన్జి విమానాల్ని కలిగి వున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 13 అంతర్జాతీయ 20 డొమెస్టిక్ డెస్టినేషన్స్ని కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు