సాహో లేటెస్ట్ అప్డేట్
- February 05, 2019యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - శ్రద్ద కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ సినిమా సెట్స్ మీద ఉందనే కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ లేకపోయేసరికి అభిమానులు ఈ సినిమా ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ నుండి ఓ వార్త బయటకు వచ్చింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ 50 శాతం పూర్తి అయ్యిందట. ఇండియాలోనే భారీ విజువల్స్ తో ఈ సినిమా రాబోతుందని , మే నెలకల్లా చిత్రం యొక్క పూర్తి వర్క్ పూర్తి చేయబోతారని , జూలై నుండి ప్రమోషన్స్ ను మొదలు పెట్టి ఆగష్టు 15న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా, యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం