ఏపీ బడ్జెట్‌: ఆరు కొత్త పథకాలు

- February 05, 2019 , by Maagulf
ఏపీ బడ్జెట్‌: ఆరు కొత్త పథకాలు

అమరావతి: ఏపీ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సారి బడ్జెట్‌లో ఆరు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతూ నిధులను మంజూరు చేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించింది.

కొత్తగా ప్రకటించిన పథకాలు ఇవే...

అన్నదాత సుఖీభవకు రూ.5వేల కోట్లు
క్షత్రియ కార్పొరేషన్‌కు రూ.50కోట్లు
హౌస్ సైట్స్ భూ సేకరణకు రూ.500 కోట్లు
ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ప్రోత్సాహానికి రూ.400కోట్లు
డ్రైవర్స్ సాధికార సంస్థకు రూ.150 కోట్లు
మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.100కోట్లు
వీటితో పాటు నిరుద్యోగ భృతిని రూ.2వేలకు పెంచిన ప్రభుత్వం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com