చికిత్స పొందుతూ వలసదారుడి మృతి

- March 09, 2019 , by Maagulf
చికిత్స పొందుతూ వలసదారుడి మృతి

భారత వలసదారుడు సంతోష్‌ శివనందన్‌, కింగ్‌ హమాద్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కొల్లాం జిల్లాలోగల ఛతన్నూర్‌కి చెందిన సంతోష్‌కి భార్య మనీషా ఉన్నారు. ఇండియన్‌ కమ్యూనిటీలో ప్రముఖ ఆర్టిస్ట్‌గా సుపరిచితులు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌లో టీచర్‌గానూ పనిచేస్తున్నారు. వీరి కుమారుడు ఇదే స్కూల్‌లో రెండో గ్రేడ్‌ చదువుతున్నాడు. పార్తీవ దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com