మెక్సికో:నైట్క్లబ్ కాల్పుల్లో 15 మంది మృతి
- March 10, 2019మెక్సికో: మెక్సికోలోని ఓ నైట్క్లబ్లో జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సలమాంకాలో ఉన్న నైట్క్లబ్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సలమాంకాలో రాష్ట్ర ఇంధన కంపెనీ పెట్రోలియస్ మెక్సికనోస్కు చెందిన మెయిన్ పైప్లైన్ ఉన్నది. ఈ పైప్లైన్ నుంచి కొందరు దుండగులు గత ఐదేండ్ల నుంచి భారీగా ఇంధన చోరీకి పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు శనివారం గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో నైట్క్లబ్లో కాల్పులు జరిగాయి. పోలీసులు మాట్లాడుతూ భారీగా ఆయుధాలు కలిగిన దుండగులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. దొంగలు ఐదేండ్ల కాలంలో రూ.21000 కోట్ల విలువైన ఇంధనాన్ని చోరీ చేశారని వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ