సౌదీ అరేబియా:బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయి విమానమెక్కిన తల్లి!
- March 12, 2019సౌదీ అరేబియా: విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఏదో సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ అయిన విమానం నిమిషాల్లోనే తిరిగి దిగడం సాధారణమే. అయితే సౌదీ అరేబియాలోని జెడ్డా ఎయిర్పోర్ట్లో ఇలాగే ఓ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఎందుకో తెలుసా.. ఆ విమానంలోని ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయి విమానమెక్కింది. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి తిప్పాలని అనుకుంటున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులకు విమాన సిబ్బంది సమాచారమిచ్చారు. సాధారణంగా ఎమర్జెన్సీ సమయాల్లోనే ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చే ఎయిర్పోర్ట్లు ఈ విషయంలో ఏం చేయాలో తెలియక కాసేపు అయోమయానికి గురయ్యాయి. ఈ విమానం తిరిగి రావడానికి అనుమతివ్వాలని కోరుతోంది. ఎందుకంటే ఓ ప్రయాణికురాలు తన బిడ్డను ఎయిర్పోర్ట్లోనే మరచిపోయింది. మేము తిరిగి రావాలా వద్దా అని పైలట్ ఏటీసీని అడిగాడు. అయిలే పైలట్ ఏం చెప్పాడో అర్థం కాక..
సరైన కారణమేంటో మరోసారి చెప్పు అని ఆ ఆపరేటర్ ప్రశ్నించాడు. దీనికి మరోసారి పైలట్ నుంచి అదే సమాధానం వచ్చింది. దీంతో మరో దారి లేక విమానం తిరిగి రావడానికి ఏటీసీ అనుమతినిచ్చింది. విమానం దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు ఆ బిడ్డను తల్లికి అప్పగించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!